అమరావతి : తిరుమల,తిరుపతి దేవస్థానంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన టీటీడీ ఉద్యోగి ఒకరిని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. బాలకృష్ణ అనే ఉద్యోగి నిరుద్యోగుల నుంచి రూ. కోటి 20 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అతడి వద్ద ఎంపీ స్టిక్కర్ కారు, నకిలీ రబ్బరు స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే వ్యక్తులను నమ్మవద్దని టీటీడీ అధికారులు సూచించారు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని వారి వద్ద నుంచి పెద్దమొత్తంలో వసూలు చేసి మోసగి స్తున్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీటీడీలో ఉద్యోగాల కోసం అధికారికంగా ఇచ్చే నోటీసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.