అమరావతి : ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన దివ్యాంగుడు తిరుపతి ఆత్మహత్య కేసులో నలుగురు పోలీసులను సస్పెన్షన్ చేశారు. ప్రాథమిక విచారణలో వచ్చిన నివేదిక ఆదారంగా డీఐజీ ఆదేశాల మేరకు ఎస్.ఐతో సహా నలుగురిని జిల్లా ఎస్పీ విజయారావు సస్పెన్షన్ చేశారు. మర్రిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందిన దివ్యాంగ యువకుడు తిరుపతయ్యను ఓ చోరీ కేసులో వారంపాటు పోలీసులు వేధించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అతడిని కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తమ కుమారుడు ఆత్మహత్యకు పోలీసులే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. దీంతో విచారణకు ఆదేశించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణ ఆదారంగా ఎస్.ఐ వెంకటరమణ, ఏఎస్ఐ జయరాజ్, కానిస్టేబుళ్లు ఎస్. కె చాంద్బాషా, సంతోష్కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.