అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు (labourer) అక్కడికక్కడే మృతిచెందారు. నారాయణపురం నుంచి చేపల లోడుతో లారీ దువ్వాడ వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తాడేపల్లిగూడెం వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. లారీ కిందపడి నలుగురు కూలీలు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను తడేపల్లిగూడెం దవాఖానకు తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.