అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటలో కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. గుంటూరులో ఇద్దరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారని వైద్యాధికారులు వెల్లడించిన హెల్త్ బులిటిన్లో పేర్కొన్నారు. కాగా కొత్తగా 154 కరోనా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,73,730 మందికి కరోనా సోకగా వారిలో 14,452 మంది మరణించారని, ప్రస్తుతం ఏపీలో 2,122 యాక్టివ్ కేసులు ఉండగా, 20,57,156 మంది రికవరీ అయ్యారని వివరించారు.
ఒకవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికి మరణాల సంఖ్య పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది. రెండు రోజుల క్రితం ముగ్గురు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.