హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా హత్యకేసులో అనుమానితుడు కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముఖ్య అనుచరుడు శివశంకర్రెడ్డిని సీబీఐ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్సపొందుతుండగా అతడిని అదుపులోకి తీసుకుని సీబీఐ కార్యాలయానికి తరలించారు. వివేకా హత్యకేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్గా మారి గత ఆగస్టులో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించి సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.
వివేకా కుమార్తె సునీత హైకోర్టుకు ఇచ్చిన అనుమానితుల్లో కూడా ఇతని పేరు కూడా ఉండడంతో ఇప్పటికే కడప, పులివెందులలో పలుమార్లు శివశంకర్రెడ్డిని సీబీఐ విచారించింది. కాగా దస్తగిరి అప్రూవర్ పిటిషన్పై ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్, సునీల్ తరఫు లాయర్లు బుధవారం కడప సబ్ కోర్టులో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా దీనిపై తదుపరి విచారణను 22కు వాయిదా వేస్తున్నామని సబ్కోర్టు ప్రకటించింది.