అమరావతి : చంద్రబాబు నాయుడును రాజకీయ సమాధి చేసే వరకు బతికే ఉంటానని, అంత వరకు విశ్రమించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఫైర్ అయ్యారు. తన ఆరోగ్యం వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దిగజారి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు.
నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, బాబు భరతం పట్టే వరకు భూమి మీదనే ఉంటానని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్కు దమ్ముంటే నాపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. 2024 ఎన్నికల తర్వాత బాబు, పవన్ కల్యాణ్ మెంటల్ దవాఖాకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు.