అమరావతి : వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ( Ambati Rambabu ) కు బెయిల్ ( Bail ) దొరికింది. దీంతో బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. సత్తెనపల్లిలో సంక్రాంతి పండుగ రోజున లక్కీడ్రాలో అవకతవకలకు పాల్పడ్డారని చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు రాంబాబును అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అంతకు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచగా అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది . అయితే వెంటనే లక్కీ డ్రా కేసులో మళ్లీ అరెస్టు చేశారు. గత 18 రోజులుగా అంబటి జైలులో ఉన్నారు. అంబటి జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారు.
తన ఇంటిపైన దాడి చేశారని, హింసించారని, భార్య, పిల్లలను తరిమారని ఆరోపించారు. అయినా వాటిని లెక్క చేయనని స్పష్టం చేశారు. ప్రజలు, ధర్మం తన వెంటే ఉన్నారని, పైన దేవుడు ఉన్నాడు. అన్నింటికి ఒకరోజు సమాదానం చెబుతాడని అన్నారు. ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తుందని, బాధితులను జైలులో పెట్టి, క్రిమినల్స్ను బయట తిరుగనిస్తున్నారని దుయ్యబట్టారు.