అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం 35వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లాలోని కండ్రిగ నుంచి యాచవరం మీదుగా వెంగమాంబపురం చేరుకోనుంది. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాదయాత్రలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. రాజధానిపై ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాల వల్ల పెట్టుబడులు రాని పరిస్థితి ఉందని వాపోయారు.
ప్రభుత్వం మళ్లీ తీసుకువస్తామంటున్న మూడు రాజధానుల బిల్లు ఎలా ఉంటుందో వేచి చూడాలని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాజధాని అంటూ ఒకటి ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం శీతాకాల సమావేశాలు విశాఖ లేదా కర్నూలులో పెట్టుకోవాలని ఆయన సూచించారు.