అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు వృత్తి నైపుణ్యత శిక్షణా కల్పనలో జరిగిన అవినీతిలో ఏ1గా ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ గురువారం నాటికి వాయిదా పడింది. సుబ్బారావు తరుఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా బుధవారం విచారణకు వచ్చింది.
సుబ్బారావుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించగా తమకు వాదనలు వినిపించేందుకు సమాచారం రావాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఇందు కోసం వారం రోజుల సమయం కోరగా హైకోర్టు వారం రోజులు ఇవ్వటం సాధ్యం కాదని గురువారం ఉదయానికి సమాచారం తెప్పించుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినేందుకు ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.