అమరావతి : ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ గంటా సుబ్బారావుకు బెయిల్ మంజూరయ్యింది.. సుబ్బారావు తరుఫున న్యాయవాది బెయిల్కు దరఖాస్తు చేయగా బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ను పరిశీలించిన కోర్టు బెయిల్కు అనుమతి ఇచ్చింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి వివిధ సంస్థల ద్వారా శిక్షణ ఇప్పించేందుకు నిధులు మంజూరు చేసింది.
అయితే నిధుల వినియోగంలో అప్పటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ సుబ్బారావుతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ, పుణే, ముంభై ప్రాంతాలకు చెందిన సెల్ కంపెనీల ప్రతినిధులు అక్రమాలకు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణల మేరకు సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా గంటా సుబ్బారావును, వివిధ కంపెనీలకు చెందిన నలుగురిని పలు దఫాలుగా అరెస్టు చేసి రిమాండ్కు పంపించింది. రిమాండ్లో ఉన్న గంటా సుబ్బారావు బెయిల్ కోసం దరాఖాస్తు చేసుకోగా కోర్టు నిరాకరించడంతో మరోసారి హైకోర్టులో వేసిన బెయిల్ పిటిషన్తో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది.