Sridhar Rao : తెలుగు పాఠకులకు సుపరిచితులైన మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావు (Sridhar Rao)ను ఉన్నత పదవి వరించింది. తన కళా నైపుణ్యంతో విశేష గుర్తింపు పొందిన ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ర్యాంక్ హోదాతో గౌరవించింది. శ్రీధర్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయన వ్యహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా శ్రీధర్ను నియమిస్తూ శుక్రవారం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు (Shyamala Rao) ఉత్తర్వులు జారీ చేశారు.
సుదీర్ఘకాలం ‘ఈనాడు’ దిన పత్రికలో త న మార్క్ కార్టూన్లతో తెలుగు లోగిళ్లకు చేరువైన పోచంపల్లి శ్రీధర్.. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా ఆయన సేవలందించనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో శ్రీధర్ రెండేళ్ల పాటు కొనసాగుతారని ఉత్వర్వుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు పేర్కొన్నారు. కేబినెట్ ర్యాంక్ హోదా కావడంతో ఆయనకు జీతభత్యాలు, అలవెన్సులు కూడా అదే స్థాయిలో వర్తిస్తాయని శ్యామల రావు వెల్లడించారు.
ఈనాడు మాజీ ఉద్యోగికి ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి
ఈనాడు మాజీ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్ రావుని సమాచార ప్రచార విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా నియమించిన ఏపీ ప్రభుత్వం
కేబినెట్ ర్యాంక్ హోదాలో రెండేళ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామల రావు pic.twitter.com/fVPcMbPHl4
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026