AP CID | హైదరాబాద్లోని ఏపీ మాజీ మంత్రి పీ నారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. ఈ
సందర్భంగా అధికారులు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో సీఐడీ అధికారులు నారాయణ వివరణ తీసుకున్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీఐడీ అధికారులు గతంలో కేసు నమోదు చేయగా.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సాక్షిగా విచారణకు రావాలంటూ నారాయణకు సీఐడీ అధికారులు 160 సీఆర్పీసీ నోటీసు ఇచ్చారు. అయితే, ఈ నోటీసుపై ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో ఉన్నారని, ఇటీవల శస్త్రచికిత్స జరిగిందని నారాయణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఆయనకు 65 ఏళ్ల వయసు దాటిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం నారాయణను హైదరాబాద్లోని ఆయన నివాసంలోనే న్యాయవాది సమక్షంలో విచారించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు హైదరాబాద్ మాజీ మంత్రి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.