అమరావతి : ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ చేశారు. సభా హక్కులను కాలరాస్తున్నందుకుగాను టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఆల వీరాంజనేయ స్వామి ని సస్పెన్షన్ చేస్తు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదివి వినిపించారు. సస్పెన్షన్ అసెంబ్లీ సమావేశాలు జరిగేంత వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు సంస్కరవంతంగా వ్యవహరించాలని, సభా నియమావళిని గౌరవించాలని స్పీకర్ కోరారు.
ప్రపంచమంతా సమావేశాలను వీక్షించిందన, సభ్యులను బయట ప్రపంచం క్షమించదని అన్నారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. సమకాలీన సభ్యుల హక్కులను సభా మొత్తం బలికావాలా అని ప్రశ్నించారు. కావాలనే అల్లరి చేయాలనే దురుద్దేశ్యంతో ప్రవర్తిస్తున్నారని ఆయన వెల్లడించారు. సస్పెన్షన్కు గురైన బయటకు తీసుకెళ్లాలని మార్సల్స్ను ఆదేశించారు.