Accident in Nellore | ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. 12 మంది ఆత్మకూర్ వాసులు సంగంలోకి శివాలయంలో నిద్ర చేయడానికి 12 మంది ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యలో బీరాపేరువాగుపై ఉన్న వంతెన దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. దీంతో వాగులో ఆటో పడిపోయింది. పోలీసులతోపాటు రోడ్డుపై వెళుతున్న వారు సహాయ చర్యలు చేపట్టారు. ఏడుగురు వ్యక్తులను వాగులో నుంచి కాపాడారు. వారిలో బాలిక పరిస్థితి విషమించడంతో ఆత్మకూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇక గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. రాత్రి కావడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. స్థానికుల సహకారంతో ఏడుగురిని కాపాడామని జిల్లా ఎస్పీ విజయారావు తెలిపారు. గల్లంతైన ఐదుగురి కోసం గాలిస్తున్నామన్నారు. వారి కోసం బోట్లు రప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.