అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తుర్లపాడు మండలం రోలుగుంపాడు ఎస్టీ కాలనీ వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. రోడ్డుపై పడిఉన్న బర్రె కళేబరంపై ఆటో ఎక్కింది. దీంతో అదుపుతప్పిన ఆటో బోల్తా పడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖాఖానకు తరలించారు. మృతులను శారమ్మ, మార్తమ్మ, లింగమ్మ, వెంకటేశ్రెడ్డిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 14 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు. బెస్తవారిపేట మండలం కొత్తపల్లిలో కార్యక్రమానికి వెళ్లివస్తుండగా ఈ ఘటన జరిగింది.