అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి 18 కిలోల బరువున్న చేప చిక్కింది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవులో సోమవారం విక్రయానికి ఉంచగా నర్సాపూర్కు చెందిన వ్యాపారి శ్రీనివాసరావు రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత కోల్కతాలోని చేపల ఎగుమతి కేంద్రంలో ఈ అరుదైన చేప రూ. 2 లక్షలు పలికింది. ఈ భారీ చేపలను చైనాకు ఎగుమతి చేస్తారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ మత్స్యకారుడు రెండు రోజుల క్రితం 30 కిలోలకు పైగా బరువున్న చేపను పట్టుకున్నాడు. ఆ చేప ధర రూ. 4.30 లక్షలు కాగా, ఒక్క చేప నాలుగు లక్షలకి చేరడం ఇదే తొలిసారి అని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలను ఔషధాల తయారీలో ఉపయోగించడంతో వీటికి మంచి డిమాండ్ వస్తోంది. ఎక్కువ డిమాండ్ ఉండడంతో వ్యాపారులు ఈ అరుదైన (కచిడి) చేపలను వేలం వేస్తారు అందుకోసమే వీటి ధర లక్షల రూపాయలు పలుకుతోంది.