అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామిక సెజ్(Sez)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. సెజ్లోని సాహితి పార్మా(Pharma) ప్రైవేట్ లిమిటెడ్ మొదటి యూనిట్లో బాయిలర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు అంటుకుంటాయోమనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.నాలుగు అగ్నిమాపక వాహనాలతో మంటలు ఆర్పివేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.