అమరావతి : కన్న తండ్రే కాలయముడిగా మారి కూతురిని హత్య చేయాలని భావించిన తండ్రికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన వైనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. శాంతి పూజల నెపంతో వేణుగోపాల్ అనే దంపతులకు మూడు సంవత్సరాల వయసున్న ఆడ కవలలు ఉన్నారు. భార్య ఇంట్లో లేని సమయంలో వీరికి శాంతిపూజలు చేయాలనే సంక్పలంతో ఆ తండ్రి ఇవాళ ఇంట్లో పూజలు నిర్వహించాడు.
ఇద్దరు కూతుర్లలో ఒకరిని తల్లితో భయట కూర్చుండబెట్టి మరొక కూతురి నోట్లో బలవంతంగా కుంకుమ కుక్కి గొంతు నులిమాడు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకోవడానికి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడి నుంచి చైన్నై ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రి వేణుగోపాల్ను అదుపులోకి తీసుకున్నారు.