అమరావతి : అనంతపురం(Anantapuram) జిల్లా బుక్కరాయసముద్రంలో విషాదం చోటు చేసుకుంది. భార్య(Wife)పై అనుమానంతో ఓ భర్త తన ఇద్దరు కుమారుల కాళ్లకు తాళ్లను కట్టి చెరువులో దూకి అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బుక్కరాయసముద్రంలో గరఫీ(35) అనే వ్యక్తి, భార్య, ఇద్దరు కుమారులు(Sons) సోహైల్(6), ఇమ్రాన్(9)తో కలిసి నివసిస్తున్నారు.
అయితే భార్యభర్తల మధ్య అనుమానం కారణంగా భర్త రఫీ ఇద్దరు కుమారులు వెంటబెట్టుకుని సమీపంలోని చెరువు కట్ట వద్దకు వెళ్లాడు. తనతో పాటు ఇద్దరి కుమారుల కాళ్లకు తాళ్లను కట్టి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం చెరువులో ముగ్గురు శవాలు తేలడంతో గ్రామస్థులు పోలీసుల(Police)కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. ముగ్గురి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.