అమరావతి : కర్నూలు జిల్లాలోని పలు మండలాల్లో రాత్రి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని హోళగుందలో పిడుగుపడి తండ్రి, కుమారుడు దుర్మరణం చెందారు. తండ్రి సిద్ధిఖ్ సాబ్(55), కుమారుడు హుస్సేన్ సాబ్(30) పిడుగుపాటుకు మృతి చెందారు. హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది.
దీంతో మండలంలోని హాలహర్వి- నిట్వట్టి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాలహర్వి- గూళ్యం రహదారి కోతకు గురైంది. మండలంలో 10 సెం.మీ వర్షపాతం నమోదైంది.