అమరావతి : ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు. దారికి అడ్డుగా ఉన్న వాషింగ్ మెషీన్ తొలగించలేదని తండ్రీ కొడుకులిద్దరూ బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.