అమరావతి : ఏపీలో బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదపల్లె వద్ద అతి వేగంగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న తండ్రి బుజ్జి(35), కుమారుడు శివఫణీంద్ర (10) మృతి చెందారు. మార్కాపురం పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.