అమరావతి : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలంలో ఓ చిరుత (Leopard ) రైతుపై దాడి చేసి గాయపరిచింది. బుధవారం మండలంలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు (Farmer)రామ్మూర్తి సమీపంలోని తన పంట పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటుండగా పొదలో మాటువేసిన చిరుత ఒక్కసారిగా అతడిపై దాచి చేసి గాయపరిచింది. చిరుత దాడితో భయాందోళనకు గురైన రైతు కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది.
ఈ దాడిలో రామ్మూర్తికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతడిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చిరుత దాడి విషయాన్ని అటవిశాఖ అధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేయడంతో అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిరుత సంచారం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా(Villegers Alert) ఉండాలని అధికారులు పిలుపునిచ్చారు