అమరావతి: విశాఖపట్నం నగరంలో ఘోరం జరిగింది. నిన్న రాత్రి హెటిరో పరిశ్రమలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. నక్కపల్లి హెటిరో పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్పించగా వీరిలో కెమిస్ట్ సాయిరాం అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.