అమరావతి : కాకినాడ గ్రామీణ మండలంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది . కన్వేయర్ బెల్ట్లో పేలుడు సంబవించి ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. కొండవరంకు చెందిన రాయుడు వీరబాబుతో పాటు సామర్లకోటకు చెందిన మరో ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన తరువాత సకాలంలో యాజమాన్యం స్పందించినట్లయితే మృతుల సంఖ్య తగ్గేదని ఆరోపిస్తూ ఫ్యా్క్టరీ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల ని డిమాండ్ చేశారు. ఘటనాస్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ సందర్శించారు.