చిత్తూరు జిల్లా : మాజీ ఎమ్మెల్సీ కారు ఢీకొని ఒక వ్యక్తి మృతిచెందాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి సమీపంలో శనివారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గౌనివారి శ్రీనివాస్ స్వయంగా వాహనం నడుపుకుంటూ వెళ్తుండగా గుండిశెట్టి పల్లి సమీపంలో దంపతులు ప్రయాణిస్తున్న బైకును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దంపతులిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో భర్త తుదిశ్వాస విడిచాడు. భార్య పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గురైన దంపతులను కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన మునెప్ (65), లక్ష్మమ్మ (55) గా గుర్తించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వెంకటే గ్రామానికి చెందిన గౌనివారి శ్రీనివాసులు గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పనిచేశారు. 1987లో ఎంపీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. 2002-04 మధ్య టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేసి 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.