తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ టీటీడీ ఉద్యోగి బాధ్యతగా వ్యవహరించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రెండేళ్ల తర్వాత మాడ వీధుల్లో భక్తుల సమక్షంలో వాహనసేవలు జరుగనున్నాయని, విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అక్టోబర్ 1న గరుడ సేవ నాడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
పరకామణి భవనం తనిఖీ
సెప్టెంబరు 28న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అన్నప్రసాదం కాంప్లెక్స్కు ఆనుకుని నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని ఈవో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సూచనలు చేశారు.