విజయవాడ : (Narayana Swamy) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తన చర్మంతో సీఎం జగన్కు చెప్పులు కుట్టించి ఇచ్చినా ఆయన రుణం తీరదని ఆయన వ్యాఖ్యానించారు. వాణిజ్యపన్నులు, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖలను ఆర్థిక శాఖ కిందకు తెచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా డిప్యూటీ సీఎం వద్ద ఉన్న వాణిజ్యపన్నుల శాఖను తొలగించింది. దాంతో ప్రస్తుతం ఆయన వద్ద ఎక్సైజ్ శాఖ ఒక్కటే ఉన్నది. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గన కిందకు తీసుకొచ్చారు.
ఈ పరిణామంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన నారాయణస్వామి.. జగన్ పాలనలోనే దళితులకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నిజమైన స్వాతంత్య్రం వచ్చిందన్నారు. తనకు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించి తన స్థాయిని పెంచారని, తన చర్మంతో జగన్కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనన్నారు. జగన్ మానవత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. జగన్ పాలనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందని ప్రశంసలు కురిపించిన ఆయన.. దళితులను చంద్రబాబులాగా అవమానించడం మీరు చూశారా? అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయమని జగన్కు సూచించగా ఆయన సానుకులంగా స్పందించారని వెల్లడించారు.
సీక్రెట్గా క్వాంటం సూపర్ కంప్యూటర్ తయారుచేసిన డ్రాగన్
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..