అమరావతి : లోన్యాప్ నిర్వాహకుల ఒత్తిళ్లకు మరోకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వీరేంద్రనాథ్ అనే విద్యార్థి బెంగళూర్లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతడు తన అవసరాల కోసం యాప్ ద్వారా లోన్ తీసుకున్నాడు. లోన్ తిరిగి చెల్లించాలని ఒత్తిళ్లకు గురి చేయడంతో పాటు అసభ్యకర ఫొటోలు పంపడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.