అమరావతి : తిరుమలలో మాదిరిగా పవిత్ర పుణ్యక్షేత్రమైన విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి పరిసర ప్రాంతాల్లోనూ రేపటి నుంచి పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం అమలుకు రంగం సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించే ఉద్యోగులు, భక్తులకు రూ. 20 నుంచి రూ. 200 వరకు జరిమానా విధిస్తామని కలెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్, కోట్సా 2003 చట్టంలో భాగంగా ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు నిషేధమన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులు, పని చేసే ఉద్యోగులు ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు వాడకూడదని స్పష్టం చేశారు. భక్తులకు అన్ని విధాలుగా ఈ చట్టంపై ఆలయంలో అవగాహన కల్పిస్తామని తెలిపారు.