అమరావతి : కోడిపందేలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని జంతు సంక్షేమ బోర్డు ఆదేశించింది. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు ఆదేశాలిచ్చింది. అప్రమత్తంగా ఉంటూ చట్టవిరుద్ధమైన కార్యక్రమాలపై చర్యలను తీసుకోవాలని సూచించింది. పోటీలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకపోతే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) హెచ్చరించింది. కోడిపందేలకు అనుమతి ఇవ్వడం, కార్యక్రమాలు నిర్వహించడం కోర్టు ధిక్కరణతో సమానమని ఏడబ్ల్యూబీఐ పేర్కొంది. నిషేధం ఉన్నప్పటికీ ఏపీలో సంక్రాంతికి కోడిపందాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారని, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని పెటా ఆరోపించింది.