అమరావతి : ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఐటీ హబ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈనెల 23న సీఎం తిరుపతి జిల్లాలో పర్యటించి కొత్త పరిశ్రమలకు భూమిపూజ నిర్వహించనున్నారని ఆయన తెలిపారు. అపాచీ షూ కంపెనీ నిర్మించనున్న పరిశ్రమ వల్ల 10వేల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. పరిశ్రమల పరంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యమని అన్నారు.