తిరుమల: తిరుమలలో ఏనుగుల (Elephants) మంద కలకలం సృష్టిస్తున్నది. ఏనుగుల మంద గత నాలుగురోజులుగా పాపవినాశనం రహదారి వెంట సంచరిస్తున్నాయి. పాపవినాశనంలోని పార్వేట మండపం వద్ద తిరుగుతున్నాయి. ఆకాశగంగ ప్రాంతంలో రోడ్లపైకి వచ్చిన ఏనుగులు వాహనదారులను వెంబడించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఏనుగులను అడవిలోకి మళ్లించేందుకు టీటీడీ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. తిరుమల వైపునకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతిలో ఇటీవల ఏనుగుల తరచూ సంచరిస్తున్నాయి.
గత ఫిబ్రవరిలో తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరించింది. ఘాట్రోడ్డులోని ఏడో మైలు వద్ద ఏనుగుల మంద రోడ్డు దాటింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అటవీశాఖ సిబ్బంది ఆ గుంపును ఫారెస్ట్లోకి మళ్లించారు.