అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉగాది కానుకగా విద్యుత్ ఛార్జీలను పెంచిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయం వరకు లాంతర్తో వచ్చి నిరసన తెలిపారు. టీడీపీ హయాంలో ఏనాడు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని గుర్తు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను నిరంతరాయంగా అందిం చామని అన్నారు. జగన్రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకు 7సార్లు వివిధ పేర్లతో ఛార్జీలను పెంచారని ఆరోపించారు.
సుమారు రూ. 14వేల కోట్లను ప్రభుత్వంపై భారం మోపిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పార్టీ అధిష్టానం త్వరలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుందని వివరించారు. టీడీపీ హయాంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణలు అమలు చేసి ఉంటే ఛార్జీల పెంపు, కరెంట్ కోతలు అవసరముండేది కాదని అన్నారు. విజనరీకి..ప్రిజనరీకి తేడా నేటి విద్యుత్ ధరలేనని పేర్కొన్నారు.