అమరావతి : ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు పట్టు్బడ్డాడు. జిల్లాలోని దొండపర్తి మండలంలో సురేష్ అనే ఉద్యోగి విద్యుత్ శాఖలో (Electricity Department) ఏఈగా పనిచేస్తున్నాడు. తన పరిధిలోని గ్రూప్ హౌస్కు చెందిన వినియోగదారులు ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లంచం ఇవ్వనిదే ట్రాన్స్ఫార్మర్ ఇవ్వనని కరాఖండిగా చెప్పడంతో వినియోగదారులు ఏసీబీని ఆశ్రయించారు.
స్పందించిన ఏసీబీ అధికారులు మంగళవారం నిఘా వేశారు. బాధితుల నుంచి ఏఈ సురేశ్ రూ.60 వేలు తీసుకుంటుండగా మెరుపుదాడి చేసి ఏఈని పట్టుకుని డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఏఈపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు.