అమరావతి : ఏపీలో వైఎస్సార్ జిల్లాలో ఎనిమిది మంది ఎర్రచందనం స్మగర్లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు, అటవీశాఖ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు, ఖాజీపేట అటవీ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడుతున్న 8 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో అంతరాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ ఫకృద్దీన్ కూడా ఉన్నారు.
ఇతడిపై జిల్లాలో 71 ఎర్రచందనం కేసులు నమోదు అయి ఉన్నాయని జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఇవాళ మీడియా సమావేశంలో వివరించారు. వీరి వద్ద నుంచి 55 ఎర్ర దుంగలు, 4 కార్లు, రూ. 9లక్షలు నగదు, బైక్, 7 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన వెల్లడించారు.