అమరావతి : నిషేధిత ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అందరి బాధ్యత అని వాల్తేర్ డీఆర్ఎం అనూప్ సత్పతి అన్నారు. ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ఇవాళ విశాఖ రైల్వేస్టేషన్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జీవీఎంసీ రైల్వే వాల్తేర్ డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ, భారత క్రికెటర్ శ్రీకర్ భరత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై రైల్వే కళాకారులు చేసిన ప్రదర్శన ప్రయాణికులను, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. విశాఖ రైల్వేస్టేషన్ నుంచి నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు సూచనలతో ప్లాస్టిక్ నిషేధిత కరపత్రాలను అందజేశారు.