అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఉన్నత విద్యా మండలి ఇవాళ ఎడ్సెట్, లాసెట్ ఫలితాలను విడుదల చేసింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఎడ్ సెట్లో 96.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన పేర్కొన్నారు. లాసెట్ 3ఏళ్ల కోర్సుకు 90.81శాతం , లాసెట్ 5ఏళ్ల కోర్సుకు 79.51శాతం ఉత్తీర్ణత సాధించగా. రెండేళ్ల పీజీ ఎల్ సెట్లో 97.24శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. లాసెట్లో మహిళలకే అత్యధిక ర్యాంకులు వచ్చాయని ఆయన వెల్లడించారు.