అమరావతి : పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం వరుస భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య భూమి ప్రకంపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3, 2.7, 2.3 గా నమోదు అయింది. చింతలపాలెం, మేళ్ల చెరువు మండలాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. గత వారం రోజులుగా పులిచితంల సమీపంలో భూమి కంపించినట్లు భూభౌతిక పరిశోధన ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్ వెల్లడించారు.