తిరుపతి జిల్లా : తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న అశ్విని దవాఖానాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. భారత ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇ-రక్త్ కోష్ పిలుపు మేరకు శనివారం తిరుమలలో రక్తదానం శిబిరాన్ని జరిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంక్లను అనుసంధానం చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి, క్రమబద్ధీకరించడానికి ఈ-రక్త్ కోష్ దోహదం చేస్తుందని అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ కుమారి తెలిపారు. అశ్విని ఆసుపత్రిలో జరిగిన మెగా రక్తదాన శిబిరంలో టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది, యాత్రికులు చురుకుగా పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, అపోలో కార్డియాక్ సెంటర్ డాక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.
అదేవిధంగా తిరుపతిలోని బర్డ్ దవాఖానలోని కేంద్రీయ వైద్యశాల బ్లడ్ బ్యాంకులో 14 మంది రక్తదానం చేశారు. ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ కావ్యశ్రీ, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.