అమరావతి : కార్తిక మాసం శివుడు, గంగాదేవి, పార్వతి దేవికి ఎంతో ప్రీతికరమైన. మాసం. ఈ మాసంలో వ్రతాలు, నోములు, దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భంగా కార్తికమాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఏపీలోని శ్రీశైలం మల్లికార్జునుడికి భక్తులు సమర్పించిన కానుకల రూపేణా భారీ ఆదాయం సమకూరింది.
నెలరోజుల పాటు కొనసాగిన కార్తిక మాసం పురస్కరించుకుని శ్రీశైలం దేవస్థానానికి సుమారు పది లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా రూ. 30,89,27,503 ల ఆదాయం వచ్చింది. ఇది గత ఏడాది కంటే రూ. 11 కోట్లు అధికమని ఆలయ ఈవో లవన్న వెల్లడించారు. దర్శనం టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, టోల్గేట్, విభూది, కంకణాలు, తులాభారం,కేశఖండన, ఆన్లైన్ సేవలు, హుండీ ఆదాయం, వివిధ పథకాల ద్వారా ఈ ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.