అమరావతి : ఏపీలో మద్యం బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది.
కృష్ణ అనే వ్యక్తి ఫుల్గా మద్యం తాగి కాలనీలో అల్లరి చేస్తున్నాడని స్థానికులు డయల్ 100కు ఫోన్కాల్ చేశారు. స్పందించిన పోలీసులు అక్కడికి వెళ్లి మందుబాబును అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆగ్రహించిన మందుబాబు అక్కడే ఉన్న ఇటుకతో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలపై బాదడంతో తీవ్రగాయం అయ్యింది. హుటాహుటిన కానిస్టేబుల్ను దవాఖానకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. నిందితుడు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.