అమరావతి : తిరుమలలో ప్లాస్టిక్ నిరోధానికి డీఆర్డీవో తనవంతు కృషి చేస్తుందని ఆ సంస్థ చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి తో కలసి లడ్డూ ప్రసాద కౌంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి ప్రసాదాన్ని ప్లాస్టిక్ కవర్లలో అందించే బదులుగా వాతావరణంలో కలిసిపోయే ఉండే బయోడిగ్రెబుల్ కవర్లను తయారు చేసేందుకు డీఆర్డీవో చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
అన్నదానం ప్లేట్లు, సత్రాల్లో ఇచే కప్పులు, గ్లాసులు బయోడిగ్రెబుల్ ఉండే కవర్ల రూపకల్పనలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. వీటిని తిరుమలలో కూడా వాడకం అయ్యేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.