Derailed | ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పింది. గుడిపల్లి మండలం బిసానత్తం రైల్వేస్టేషన్కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. చెన్నై నుంచి బెంగళూరుకు వెళ్తున్న రైలు కర్ణాటక సరిహద్దులోని బిసానత్తం వద్ద పట్టాలు తప్పింది. అయితే, లోకోపైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేశారు.
దాంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. విషయం తెలుసుకున్న అధికారులు రైలును సరి చేసేందుకు చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై – బెంగళూరు మార్గంలోని పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బృందావన్ ఎక్స్ప్రెస్ను కుప్పం స్టేషన్కు దగ్గరలో నిలిపివేశారు. బెంగళూరు కంటోన్మెంట్ స్పెషల్ రైలును తమిళనాడులోని జోలారుపేట జంక్షన్లో నిలిపివేయగా.. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.