శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానం పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోతో ఎలాంటి సంబంధం లేదని ఈవో లవన్న స్పష్టం చేశారు. దేవస్థానం పేరిట జరుగుతున్న అసత్య ప్రచారాలను భక్తులు నమ్మొద్దని, అలాంటి ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గురువారం పలు హిందూ ధార్మిక సంఘాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారమవుతున్న వీడియోను క్షుణ్ణంగా దేవస్థాన అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. ఆ వీడియోలో ఉన్న దేవాలయం ఎక్కడి? ఎప్పుడు జరిగిందో గుర్తించలేకపోయినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో శ్రీశైల
దేవస్థాం, పరివార దేవాలయాలకు గానీ సంబంధం లేదని తేల్చి చెప్పారు. అలాంటి దుష్ప్రచారాలను భక్తులు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.