తిరుపతి : భక్తుల కోరికను తీర్చే తిరుమల (Tirumala) వేంకటేశ్వరస్వామికి దాతల నుంచి విరాళపర్వం కొనసాగుతుంది. బెంగుళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ పర్నస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం (Donation) గా అందజేసింది. ఈ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది.
టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 69,072 మంది దర్శించుకోగా 26,239 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.51 కోట్లు వచ్చిందన్నారు.