తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. కార్తిక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం వెళ్లారు. అయితే సోమవారం తెల్లవారుజామున ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో దవాఖానకు తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు.
డాలరు శేషాద్రి 1978 నుంచి శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. 2007లో పదవీ విరమణ చేసినప్పటికీ.. శేషాద్రి సేవలు తప్పనిసరి కావడంతో టీటీడీ ఆయనను ఓఎస్డీగా కొనసాగిస్తున్నది. డాలర్ శేషాద్రి హఠాన్మరణం పట్ల టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటన్నారు.