అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని ఎమ్మెల్యే పదవే ముద్దు అని అన్నారు. తనను నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిపించారని, ఎమ్మెల్యే పదవి అంటేనే ఇష్టమని వెల్లడించారు. నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల మంది ప్రజలు తనను కాదనుకుంటే బాధ పడుతానని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో బాబు జగ్జీవన్రాం విగ్రహావిష్కరణలో నాని మాట్లాడారు.
జగన్ ప్రభుత్వం ఏర్పడ్డ క్యాబినెట్లో ఎప్పుడు లేని విధంగా 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు పాలనలో 65 శాతం అగ్రవర్ణాల వారే ఉండేవారని అన్నారు. 25 మందిలో 16 మంది వారు అగ్రవర్ణాలవారే ఉండేవారని అన్నారు. ‘ రాజకీయాలను అగ్రవర్ణాలే నడపగలవు. వీరు చెబితేనే ప్రజలు ఓట్లు వేస్తారు. వీరి చెప్పుచేతుల్లోనే అధికారముంటుందని ’భ్రమల్లో ఉండేవారని తెలిపారు. జగన్ నిర్ణయం మేరకు ఆర్థిక, సామాజిక, కుల ప్రాధాన్యతల పరంగా మంత్రి పదవులు కోల్పోయ్యాయమని అన్నారు. జగన్ వద్ద పనిచేయడం గౌరవంగా పనిచేస్తామని పేర్కొన్నారు.