అమరావతి : అనంతపురం టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. టికెట్ ఆశించి భంగపడ్డ అభ్యర్థి అనుచరులు టీడీపీ కార్యాయంలో బీభత్సం సృష్టించారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం(Furniture burnt) , దహనం చేసి నిరసన తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా (Final list) ను శుక్రవారం ప్రకటించారు. అనంతపురం అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ పేరును ప్రకటించారు.
దీంతో ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయం తలుపులను బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్ను , టీడీపీ జెండాను, చంద్రబాబు ఫ్లెక్సీలను బయటకు తీసుకువచ్చి దహనం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా అనుకోలేదని పేర్కొన్నారు. పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన నాయకులకు తగిని గుర్తింపు లేకుంటే పార్టీ మనుగడ కష్టమని ఆరోపించారు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని శనివారం పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.