అమరావతి : ఏపీ సీఎం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బందోబస్తులో ఉన్న ట్రాఫిక్ ఏఎస్ఐ కుప్పకూలి మృతి చెందాడు. బుధవారం ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించారు.ఈ సందర్భంగా పరిసర జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, ట్రాఫిక్ పోలీసులకు నరసన్నపేటలో డ్యూటీ వేశారు. అనకాపల్లి ట్రాఫిక్ ఏఎస్ఐగా పనిచేస్తున్న అప్పారావును సైతం నరసన్నపేటలో డ్యూటీ వేయగా బుధవారం ఆయన విధుల్లో ఉండగా తీవ్ర అస్వస్థతకులోనై మృతి చెందాడు. అనారోగ్య కారణంతోనే ఏఎస్ఐ మృతి చెందాడని జిల్లా పోలీసులు వివరించారు.